ఎన్టీఆర్ నగర్ లో అభివృద్ధి పనుల తనిఖీ నిర్వహించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రె

Published: Tuesday January 11, 2022
శేరిలింగంపల్లి- ప్రజాపాలన : నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ నగర్ లో ఈ రోజు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఏఈ సునీల్ తో కలిసి నూతనంగా నిర్మిస్తున్న భుగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులను పరిశీలించరు. అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఎన్టీఆర్ నగర్ వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ నగర్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు ఉండడంతో పాత డ్రైనేజీ పైప్ లైన్ బ్లాక్ అయినందువలన, కొత్త పైప్ లైన్ వేస్తున్న పనులను అధికారులతో పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఈ సునీల్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి. సీనియర్ నాయకులు వేణు రెడ్డి, సుబ్రహ్మణ్యం, బాబు రావు, రాజు, సాయి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.