ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శమీ పూజ

Published: Friday October 07, 2022

ఆసిఫాబాద్ లో ఘనంగా దసరా వేడుకలు **

ఆసిఫాబాద్ జిల్లా అక్టోబర్ 06 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలో దసరా పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పండగ సందర్భంగా నూతన వస్త్రాలను ధరించి హలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాహనాల పూజ, నూతన పనులను దసరా సందర్భంగా ప్రారంభించారు. పట్టణంలోని శ్రీ వీరాంజనేయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో "శమీ పూజలు నిర్వహించి" ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపి, పండగ ప్రాముఖ్యతను వివరించారు. ఆలయ కమిటీ నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ధర్మపురి వెంకటేశ్వర్లు, పిన్న వివేక్,ఎకిరాల శ్రీనివాస్, రాధా కృష్ణ చారి, మురళి గౌడ్, డాక్టర్ రమేష్, మధు, డీఎస్పీ శ్రీనివాస్, చిలువేరు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

 

హిందూ వాహిని ఆధ్వర్యంలో రావణ దహనం **

 

జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ శ్రీ వీరాంజనేయ ఆలయ సమీపంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో బుధవారం రాత్రి రావణ దహనం కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని ప్రతినిధులు బోనగిరి సతీష్ బాబు,ఖాండ్రే విశాల్, సిద్ధం శెట్టి సుహాసిని, కొలిపాక వేణుగోపాల్, ప్రశాంత్, ప్రణయ్, నాగరాజు, రావుల శంకర్, వారణాసి శ్రీనివాస్, కోట వెంకన్న, గణేష్, శ్రవణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.