దొంత మాల కిషోర్ కుమార్. ఆధ్వర్యంలోరాజన్న యాదిలో జెండా పండుగ

Published: Wednesday August 11, 2021
మధిర, ఆగష్టు 10, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీమధిర పట్టణంలో మంగళవారం ysrtp  ఖమ్మం పార్లమెంటరీ కో కన్వీనర్ దొంత మాల కిషోర్ కుమార్ రాజన్న యాదిలో YSR జెండా పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదట జమలాపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వైయస్సార్ తెలంగాణ పార్టీ జెండా కు పూజ చేయించి, అనంతరం మధిర లో ర్యాలీగా అంబేద్కర్ సెంటర్ నుంచి రాజశేఖర్ రెడ్డి  విగ్రహం వరకు వెళ్లి రాజన్న యాదిలో జెండా పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ లక్కినేని సుధీర్ మరియు టీకే మోహన్ మరియు భరత్ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్య నిర్వాహక సభ్యులు నంబూరి శ్రీనివాసరావు, మధ్యల ప్రసాద్, వాకా వీరారెడ్డి, గూడూరు రమణారెడ్డి, సామినేని రవి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.