మళ్ళీ వచ్చేది బి ఆర్ యస్ ప్రభుత్వమే - యం పి నామా నాగేశ్వరరావు

Published: Monday April 03, 2023
 అశ్వారావుపేట ప్రజాపాలన ప్రతి నిధి: అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం లాక్ష్యా గార్డెన్స్ లో యం ఎల్ ఏ మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చండ్రుగొండ మండల స్థాయి బీ ఆర్ యస్ యస్ పార్టీ కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా యం పి నామా నాగేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రమన్న తెలంగాణ ప్రజల అన్నా కేంద్ర ప్రభుత్వానికి చిన్న చూపు అని పట్టించుకోవడం లేదని అన్నారు.ఈ సందర్భంగా ఇరువురిని యం ఎల్ ఏ మెచ్చా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ది జరిగిందని,
బి ఆర్ యస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 
పార్టీకి కార్యకర్తలే బలం అని అన్నారు.
 ప్రసంగించిన అనంతరం నాయకులతో కార్యకర్తలతో ఆత్మీయంగా మాట్లాడుతూ వారితో సమయం గడిపారు అలాగే స్వయంగా భోజనం వడ్డించారు.
ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు రావు జోగేశ్వరరావు,దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,దొడ్డకుల రాజేశ్వరరావు, బోయినపల్లి సుధాకర్ రావు, జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి,మోహన్ రెడ్డి,మోహన్,రఘు,తదితరులు పాల్గొన్నారు.