ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 2 ప్రజాపాలన ప్రతినిధి *ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉం
2023 సంవత్సరంలో ఇబ్రహీంపట్నం ప్రజలు సుభిక్షంగా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి గారు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ నూతన సంవత్సరంలో ప్రజలంతా సౌభాగ్యాలతో జీవించాలని మంచి ఆశయాలను కలిగి వాటిని సాధించే విధంగా ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ సంవత్సరం పట్నం ప్రజలకు పాడి సంపదలు నిండుగా పండాలని పండిన పంటకు గిట్టుబాటు ధర రావాలని చిలుక మధుసూదన్ రెడ్డి గారు ఆకాంక్షించారు.ఈ సంవత్సరమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయకుండా ఓట్లు వేసి గెలిపించిన రైతులకు ప్రజల కోసం పనిచేయాలన్నారు.రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ విస్తరిస్తుందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాల ను గాలికి వదిలేయకుండా సరియైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఆ భగవంతుడు పట్నం ప్రజలకు మరింత ధైర్యాన్ని, శక్తిని అందించాలని చిలుక మధుసూదన్ రెడ్డి గారు ఆ భగవంతుణ్ణి వేడుకోవడం జరిగింది*
Share this on your social network: