ఆల్బెండజోల్ మాత్రలతో నులిపురుగుల నివారణ

Published: Friday September 16, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 15 సెప్టెంబర్ ప్రజా పాలన : ఆల్బెండజోల్ మాత్రల ద్వారా నులి పురుగులను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. గురువారం జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం సందర్బంగా కొత్తగడిలోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నులి పురుగులు ఏర్పడడంతో పోషకాహార లోపం రక్తహీనతతో అలసటగా ఉంటుంది అన్నారు.  పిల్లలు ఎప్పుడూ కూడా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలని కలెక్టర్ సూచించారు. పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు.  నులిపురుగులు ఉండడం వలన మనం తీసుకున్న ఆహారాన్ని పురుగులు తీసుకోవడంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతారని అన్నారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన గావించారు. తదుపరి విద్యార్థినిలకు ఆల్బెండజోల్ మాత్రలను కలెక్టర్ స్వయంగా వేశారు. 
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ , పాఠశాల ప్రిన్సిపల్ అపర్ణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పాల్వన్ కుమార్, డిప్యూటీ డిఎంహెచ్ఓ జీవరాజ్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.