వాగు పై వంతెన నిర్మాణం చేయాలి. సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి మామిడి విజయ్

Published: Monday February 27, 2023

జన్నారం, ఫిబ్రవరి 26, ప్రజాపాలన:  జన్నారం గ్రామ పంచాయతీ నుంచి  గిరిజన గుడారాలకు వెళ్ళె దారిలో ఉన్న వాగుపై   వంతెన నిర్మాణం   చేపట్టాలని  సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి మామిడి విజయ్ కోరారు. ఆదివారం ప్రజాపాలన తో మాట్లాడారు. వర్షాకాలంలో జన్నారం నుంచి లోతుర్రే, బంగారు తండా, సోనాపూర్ తండా, దొంగ పెళ్లి, రాము నాయక్ తండ లకు సంబంధించిన ప్రజలు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నాడు. వర్షం కురిసి వాగు ఉప్పోంగిన ప్రతిసారీ గిరిజన గూడాలకు రాకపోకలు స్తంభించింది పోతున్నాయని అన్నారు. పలు సందర్భాల్లో అత్యవసర చికిత్స కోసం 108,104, సర్విస్ లు గూండాలు రాని పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరిగిన ఉదాంతాలు కూడా ఉన్నాయని అన్నారు. దాదాపుగా వెయ్యి మంది ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో ప్రజల ఇబ్బందులు గుర్తించి వెంటనే జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే లు చొరవ తీసుకుని  వాగుపై వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన డిమాండ్ కోరాడు..