పట్టణ అభివృద్ధే ప్రథమ లక్ష్యం
Published: Wednesday June 08, 2022
వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్
వికారాబాద్ బ్యూరో జూన్ 07 ప్రజా పాలన : పట్టణ అభివృద్ధే ప్రథమ లక్ష్యంగా కృషి చేస్తున్నామని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ అన్నారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 4వ, 5వ, 16వ వార్డులలో 5వ రోజు పట్టణ ప్రగతి పనులను మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ వార్డు కౌన్సిలర్లు నాజ్రిన్ బేగమ్ షరీఫ్ పల్గుట్ట ప్రవళిక కృష్ణ ఆలూరి రాజ్యలక్ష్మి రమణ ఆర్పి రోజా లతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పట్టణాలు మరింత అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంతో వికారాబాద్ పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. అలాగే రాబోయే హరితహారం కార్యక్రమంలో ఎక్కడెక్కడ అవెన్యూ ప్లాంటేషన్ చేయాలో ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈ రామ్ కిషన్, నాయకులు రమణ, షరీఫ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: