సేవా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలి

Published: Thursday September 30, 2021
ప్రపంచ హృదయ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్
జగిత్యాల, సెప్టెంబర్ 29, (ప్రజాపాలన ప్రతినిధి) : సేవా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా (నేషనల్ హార్ట్ డే) రీసెర్చ్ సొసైటీ పర్ స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా మరియు సేవా భారతి జిల్లా అధ్యక్షులు డా.బీమనాతి శంకర్  ఆధ్వర్యంలో పట్టణంలో ఉమా శంకర్ గార్డెన్స్ లో మధుమేహ నిర్దారణ ఉచిత వైద్య శిబిరం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత దేశంలో డయాబెటిక్ సమస్య రోజు రోజుకు తీవ్రం అవుతుందని, ప్రజలు శారీరకశ్రమ, ఆహారఅలవాట్లు, వ్యాయామం కాపాడుకోవ్చని అన్నారు. జగిత్యాల జిల్లా లో 18 ప్రైమరీ హెల్త్ కేంద్రాలు ఉన్నాయని, ప్రతి రోజు షుగర్ తో పాటు 57 పరీక్షలు గుండె, కొవ్వు, తైరాయిడ్ ఇలా 57 పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారని, ఉచిత పరీక్షలు చేయించుకోవాలని దరూర్ క్యాంప్ 2 కోట్ల తో డయాగ్నస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించామని ఉచిత పరీక్షలు చేయటం తో పాటు ఆన్లైన్ ద్వారా మెసేజ్ రూపంలో ఫలితాలు వస్తాయని, వైరాలజీ ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు. ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు చేయలేదని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి పనిచేయటం ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని, ధనిక దేశాల్లో కూడా స్వచ్ఛంద సంస్థల భాగం గొప్పదని, బీద, మధ్యతరగతి ప్రజలకు దాతృత్వ సంస్థల సేవలు అవసరమని, ఈనాడు సేవా భారతి మధుమేహ ఉచిత నిర్దారణ శిబిరం ఏర్పాటు చేసిన డా.బీమనాతి శంకర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి, ఐఎంఏ అధ్యక్షులు డా.నరహరి, పట్టణ సేవ భారతి అధ్యక్షులు పురుషోత్తం, స్థానిక కౌన్సిలర్ లు అల్లే గంగసాగర్, రాజ్ కుమార్, నాయకులు భోగ ప్రవీణ్, కత్రోజ్ గిరి, కూతురు శేఖర్, ప్రతాప్, రాజు, తదితరులు పాల్గొన్నారు.