ఆశ భాదిత కుటుంబాలకు బియ్యం పంపిణీ

Published: Saturday March 20, 2021
మధిర, మార్చి 19, ప్రజాపాలన ప్రతినిధి : మధిరలో ప్రముఖ సామాజిక సేవకులు లంకా కొండయ్య ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద PRTU మధిర మండల శాఖ అధ్యక్షులు కొమ్ము శ్రీనివాసరావు సౌజన్యం తో ఆశా బాధిత కుటుంబాలకు 50 కేజీల బియ్యం ను PRTU జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్.రంగారావు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఆర్.బ్రహ్మా రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎస్.కె.మదార్ చేతులు మీదగా పంపిణీ చేశారు. ఈ సందర్భం గా లంకా కొండయ్య మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో కూడా పి.ఆర్.టి.యు నాయకులు అనాదలు, నిరుపేదలు, కరోనా బాధితులను ఆదుకుకున్నారని ఇప్పుడు కూడా ఆశా బాధిత కుటుంబాలకు చేయూత నివ్వడానికి కొమ్ము శ్రీను గారు ముందుకు రావడం పట్ల వారికి, వారి సంఘానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.