న్యాయవాది దంపతులకు నివాళులు

Published: Saturday February 20, 2021

ప్రజాపాలన, పిబ్రవరి19, క్యాతనల్లి: పురపాలక సంఘం రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తా లో గురువారం రామకృష్ణపూర్ యువత ఆధ్వర్యంలో న్యాయవాది దంపతుల చిత్ర పటానికి పూలమాల వేసి, కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. అనంతరం యువత మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లో జరిగిన న్యాయవాది దంపతులు వామన్ రావు, నాగమణి హత్య ఘటన కుట్రపూరిత ఘటన అని తెలిపారు. పట్ట పగలే దారుణంగా హత్యలు జరుగుతుంటే ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారని తెలిపారు. న్యాయవాది కుటుంబానికే ఇలాంటి సంఘటన జరిగితే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీని వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉందనే విషయం అర్ధం అవుతుందని తెలిపారు. వామన్ రావు వాదిస్తున్న కేసులలో సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో అన్ని వర్గాల ప్రజలతో న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలిగిరి కనకరాజు, జంగంపల్లి మల్లయ్య, పొన్నాల సాగర్, మాధవరావు, సత్యనారాయణ, రాచర్ల సరేష్, వెంకటేష్, శివ కృష్ణ, సాయి, శ్రీనివాస్, జలీల్ తదితరులు పాల్గొన్నారు