కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ కార్పొరేటర్

Published: Saturday June 11, 2022
మేడిపల్లి, జూన్10 (ప్రజాపాలన ప్రతినిధి)
 ప్రధానమంత్రి నరేంద్ర మోడి 8  సంవత్సరాల సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలను హబ్సిగూడ డివిజన్ వెంకట్ రెడ్డి నగర్లో  ఉప్పల్ మాజీ శాసన సభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, స్థానిక  కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరిష్ ఇంటింటా తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. 
ఈ కార్యక్రమంలో ఓబిసి రాష్ట్ర అధికార ప్రతినిధి వేములకొండ సోమశేఖర్ గౌడ్ సీనియర్ నాయకులు రాగి వెంకట్ రెడ్డి, కొత్తపల్లి రమేష్ గుప్త, పూజారి సోమయ్య గౌడ్, వాసం పాండు, పెంటవల్లి వెంకన్న, లక్ష్మణ్, పూలక్రిష్ణ, కొటమర్తి వెంకటేష్, డివిజన్ ప్రధాన కార్యదర్శి చెల్లోజు ఎల్లాచారి,  డివిజన్ కోశాధికారి సోమ శ్రీనివాస్ గుప్త, నోముల శాంతికూమర్, గోరేటి రఘగౌడ్, ముశిగంపల శివగౌడ్, పుచ్చల అశోక్ మహిళ మోర్చ అధ్యక్షురాలు రాగి లతా వెంకట్ రెడ్డి, ఆశాజి,సాదినేని గీతా తదితరులు పాల్గొన్నారు.