రైలు నుండి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలు ప్రధమ చికిత్స అందించిన 108 సిబ్బంది

Published: Monday July 25, 2022

బోనకల్, జూలై 24 ప్రజాపాలన ప్రతినిధి: రైలు నుండి ప్రమాదవశత్తూ జారిపడిన వ్యక్తి కి తీవ్ర గాయాలయ్యాయిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది.108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ బలలాగ్ జిల్లా,తర్వావాజ్ గ్రామానికి చెందిన పిర్స్ అవియాష్ రామ్ (28) అనే వ్యక్తి మధ్యప్రదేశ్ నుండి తమిళనాడు లోని కన్యాకుమారి పవర్ ప్లాంట్ లో కూలి పనికి రైల్ లో వెళుతుండగా బోనకల్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుండి జారిపడి తీవ్రగాయాలు అయ్యాయి.సమాచారం అందుకున్న 108 సిబ్బంది కోట భాను సహన్, కలసాని వెంకటరావు క్షతగాత్రునికి ప్రథమ చికిత్స అందించి జిల్లా ప్రధాన ఆసుపత్రి కి తరలించారు