గీత కార్మికున్ని ఆదుకోవాలి

Published: Friday February 10, 2023

జన్నారం, ఫిబ్రవరి 09, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం.మండలం తపాలపూర్ గ్రామంలో ఈత చెట్టుపై నుండి ప్రమాదవశాత్తు జారిపడి గాయాలపాలైన గీతా కార్మికుడు కాసారపు మల్లేష్ గౌడ్ ను ప్రభుత్వం ఆదుకోవాలని జన్నారం మండల గౌడ సంఘం అధ్యకులు మూల భాస్కర్ గౌడ్ కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గీత కార్మికుడు కల్లు గిసేందుకు ఈత చెట్టు ఎక్కగా జరిపడడంతో పక్కటీ ఎముకలు విరిగిపోయాయని నిరుపేద కుటుంబానికి చెందిన మల్లేష్ గౌడను ఆదుకోవాలని కోరారు. కుటుంబ పెద్ద దిక్కు అయినా గీత కార్మికుడు ఇలా మంచాన పడటం ద్వారా ఆ కుటుంబం ఏలా జీవించాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. దాతలు ఎవరైనా ఉంటే ఆ కుటుంబానికి సహకారం చేయాలని ఆయన కోరారు