తెరాస పార్టీ పాలనలో సర్వజనులకు సంక్షేమం

Published: Tuesday March 29, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 28 మార్చి ప్రజాపాలన : తెరాస పార్టీ పాలనలో సర్వజనులకు సంక్షేమం అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్ కు దక్కుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో వికారాబాద్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో తెరాస పార్టీలో చేరిన ధారూర్ మండలం అంతారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు 20 మంది కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.