కన్నుల పండుగగా పురవీధుల్లో అయ్యప్ప స్వాముల నగర సంకీర్తన **
Published: Wednesday December 28, 2022
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 27 (ప్రజాపాలన, ప్రతినిధి) :
అయ్యప్ప ఆలయంలో మహా పడిపూజ సందర్భంగా జిల్లా కేంద్రాల్లోని ప్రధాన వీధుల్లో మంగళవారం అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నగర సంకీర్తన కన్నుల పండుగగా సాగింది. జిల్లా కేంద్రంలోని వాసవి మందిర్ నుండి ఉదయం 6 గంటలకు ప్రారంభమైన నగర సంకీర్తన బ్రాహ్మణవాడ, రావుల వాడ, గాంధీచౌక్, వివేకానంద చౌక్ మీదుగా ప్రధాన రహదారి గుండా ఆలయానికి చేరుకుంది. నగర సంకీర్తనలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అయ్యప్ప నామస్మరణ చేస్తూ అయ్యప్ప ఆభరణాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి వెంకట్ గౌడ్, కోశాధికారి చంద్రమోహన్, వ్యవస్థాపకుడు ఖాండ్రే కిషన్, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్ గురు స్వాములు మోహన్ విశాల్, శ్రీనివాస్, వినాయక్, సంతోష్ ఇతర స్వాములు పాల్గొన్నారు.
Share this on your social network: