కన్నుల పండుగగా పురవీధుల్లో అయ్యప్ప స్వాముల నగర సంకీర్తన **

Published: Wednesday December 28, 2022
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 27 (ప్రజాపాలన, ప్రతినిధి) : 
అయ్యప్ప ఆలయంలో మహా పడిపూజ సందర్భంగా జిల్లా కేంద్రాల్లోని ప్రధాన వీధుల్లో మంగళవారం అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నగర సంకీర్తన కన్నుల పండుగగా సాగింది. జిల్లా కేంద్రంలోని వాసవి మందిర్ నుండి ఉదయం 6 గంటలకు ప్రారంభమైన నగర సంకీర్తన బ్రాహ్మణవాడ, రావుల వాడ, గాంధీచౌక్, వివేకానంద చౌక్ మీదుగా ప్రధాన రహదారి గుండా ఆలయానికి చేరుకుంది. నగర సంకీర్తనలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అయ్యప్ప నామస్మరణ చేస్తూ అయ్యప్ప ఆభరణాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి వెంకట్ గౌడ్, కోశాధికారి చంద్రమోహన్, వ్యవస్థాపకుడు ఖాండ్రే కిషన్, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్ గురు స్వాములు మోహన్ విశాల్, శ్రీనివాస్, వినాయక్, సంతోష్ ఇతర స్వాములు పాల్గొన్నారు.