బీజేపీ కార్పొరేటర్ చేతన హరీష్ కు వార్డు కార్యాలయంను కేటాయించిన అధికారులు

Published: Tuesday April 20, 2021
మేడిపల్లి, ఏప్రిల్19 (ప్రజాపాలన ప్రతినిధి) : హబ్సిగూడ బీజేపీ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ కు వార్డు కార్యాలయం కేటాయించకపోవడంతో కార్పొరేటర్ గత ఐదు రోజుల నుండి ప్రజాసమస్యలను చెట్ల కింద కూర్చొని పరిష్కరిస్తున్నారు. వార్డు కార్యాలయం కేటాయించాలని లేదంటే చెట్టు కింద నుంచే ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని గత ఐదు రోజుల నుండి కార్పొరేటర్ నిరసన తెలిపారు. ఎట్టకేలకు స్పందించిన ఉప్పల్ మున్సిపల్ అధికారులు ఈఈ నాగేందర్, ఏఈ కీర్తి హబ్సిగూడ డివిజన్ వార్డు కార్యాలయంను కేటాయిస్తామని కార్పొరేటర్ చేతన హరీష్ కు  తెలియజేశారు. దీనిికి కార్పొరేటర్  హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమంలో డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కక్కిరేణి హరీష్, ప్రధానకార్యదర్శిలు చెల్లోజు ఎల్లాచారిి, చింతకింది ప్రవీణ్, సీనియర్ నాయకులు సంజయ్ పటేల్, రవీందర్ రెడ్డి,  న్యాలకొండ సుమన్ రావు, రంగరవి పాశం ప్రవీణ్, దారం వెంకట్ గుప్తా, శివగౌడ్, మహిళా మోర్చ అధ్యక్షురాలు రాగి లతవెంకట్ రెడ్డి, ఆశామిస్రా, లక్ష్మి భాస్కర్, శశిదర్, రాజు తదితరులు పాల్గొన్నారు.