క్రీడా మైదానం రక్షణ కోరుతు కలెక్టర్ కు వినతి పత్రం

Published: Thursday March 18, 2021
గొల్లపల్లి, మార్చి 17 (ప్రజాపాలన ప్రతినిధి): గొల్లపల్లి మండలం తిరుమలపురం (పీడీ) గ్రామంలో గ్రామపంచాయతీ ముందు ఉన్న ఏస్పీ బీసీ కాలనినిలో శివాజీ క్రీడా మైదానంలో సర్పంచ్ ఎరవేణి రమేష్ 1986సం లోకా వాసుల బహుళ ప్రయోజనార్దము సర్వే నెం 509 కొంతస్థలం ప్రభుత్వం కేటాయించారు. అందులో 80 కుటుంబాల వారు బతుకమ్మ వేడుకలు సంసృతిక కార్యక్రమాలు క్రీడలు పెద్దలు పిల్లలు వియోగించుకుంటున్నారు ప్రభుత్వ స్థలం పై సర్పంచ్ చేయతలపెట్టిన హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణం గూర్చి గ్రామసభలో వ్యతిరేకంగా కాలనీ వాసులు రాత పూర్వకంగా మౌఖికంగా తెలపనైనది.కావాల్సిన స్థలాలు ప్రభుత్వ భూములు ఉన్నకాని దళిత బహుజనులు చేసిన విన్నపాలు తిరస్కరించి సంబంధించిన అధికారులచే స్థలం కేటాయించినారు ఇట్టి విషయం గూర్చి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఈరోజు న్యాయం కోసం పిర్యాదు చేస్తూ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జె లక్ష్మీ రాజాం పీ జీవన్ డీ మధు జె బాపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Attachments are