దేశభక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఊరేగింపు కార్యక్రమంకార్యక్రమంలో పాల్గొన్న మాజీ మునిస
Published: Monday October 18, 2021
మధిర, అక్టోబర్ 17, ప్రజాపాలన ప్రతినిధిన : మధిర పట్టణంలోని లడక బజార్ నందు దేశభక్తి జన సంఘం ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేసుకొని శనివారం ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా నవరాత్రులు బతుకమ్మలు చేసిన వారికి బహుమతులు అందజేశారు. అలాగే లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించి బహుమతులు మాజీ మునిసిపల్ చైర్పర్సన్ మొండితోక నాగరాణిసుధాకర్, మరియు వార్డ్ కౌన్సిలర్ అరిగే రజిని అందజేశారు. తదుపరి పుర వీధులలో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమoలో మధిర మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మొండితోక నాగరాణి. వార్డు కౌన్సిలర్ అరిగే రజిని దేశ భక్తి యువజనసంఘం బాధ్యులు చెరుపల్లి శ్రీధర్, అరిగె శ్రీనివాసరావు, వల్లి శెట్టి శ్రీనివాసరావు, గుంటూరు రమణ రావు, చక్రవర్తుల వరదరాజన్, ఉపేంద్ర, బాహాటం వెంకటేశ్వర రాజు, పంది శ్రీను, కనకచారి, పంతంగి శేషగిరి, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: