అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న

Published: Monday May 30, 2022
కమల్ రాజు కొండబాలజడ్పీ నిధులతో గ్రామాలకు మహర్దశజడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
మధిర రూరల్ మే 28 ప్రజా పాలన ప్రతినిధి  జిల్లా పరిషత్ నిధులతో గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. శనివారం మండలంలోని వెంకటాపురం బుచ్చిరెడ్డిపాలెం గ్రామాల్లో జిల్లా పరిషత్ నిధులతో నిర్మించబోయే సిమెంట్ రోడ్ల కు కాజీ పురం గ్రామం లో కల్వర్టు నిర్మాణానికి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లింగాల కమల్ రాజు మాట్లాడుతూ జిల్లా పరిషత్ నిధుల నుండి మధిర నియోజకవర్గంలో పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా పరిషత్ నిధుల నుండి గ్రామాల్లో ప్రధానంగా సిమెంట్ రోడ్లు నిర్మాణం, దళితుల స్మశాన వాటికలను అభివృద్ధి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టిఆర్ఎస్ పాలన లోనే మధిర నియోజక వర్గం అభివృద్ధి సాధించిందని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అంతర్గత రోడ్ల నిర్మాణం, లింక్ రోడ్ల పునరుద్ధరణ తో పాటు అనేక అభివృద్ధి పనులు ముమ్మరంగా కొన సాగుతున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు మండల కో ఆప్షన్ సభ్యులు అహ్మద్ అలీ చావా వేణు సర్పంచ్ ఫర్జాన బేగం తదితరులు పాల్గొన్నారు.