పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి మున్సిపల్ చైర్మన్ మొండితోక లత

Published: Wednesday November 30, 2022

మధిర రూరల్ నవంబర్ 29 (ప్రజా పాలన ప్రతినిధి) ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత కమిషనర్ అంబటి రమాదేవి కోరారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 17 వార్డులో వారు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి సీజనల్ వ్యాధులు దరి చేరవన్నారు. రహదారులపై చెత్త వేయవద్దని మున్సిపాలిటీకి సంబంధించిన చెత్త బండి వచ్చినప్పుడు  ప్రజలు చెత్త వేయాలన్నారు. రహదారులపై చెత్త వేస్తే జరిమానా విధిస్తామని వారు తెలిపారు. మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలు అందరూ సహకరించాలని వారు కోరారు. ప్రజలు పాలకమండలి సహకారంతో  మధిర మున్సిపాలిటీని  అన్ని రంగాల్లో అభివృద్ధి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మునుగోటి వెంకటేశ్వరావు మేనేజర్ రవీందర్ మున్సిపల్ ఇన్చార్జీలు సిబ్బంది పాల్గొన్నారు.