ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ

Published: Wednesday February 16, 2022
మేడిపల్లి, ఫిబ్రవరి 15 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ డీఎంహెచ్వో నారాయణరావు, డాక్టర్లు సౌందర్య లత, స్వప్నిక, మెడికల్ సూపర్వైజర్ భోగ ప్రకాష్ లతో కలిసి ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. అనంతరం ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేముల సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మూడు రోజుల  జన్మదిన వేడుకలో భాగంగా ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు మేకల మధుసూదన్ రెడ్డి, జనంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గడ్డం రవి కుమార్, గరిక సుధాకర్, గంగిడి కృష్ణారెడ్డి, చింతల నరసింహారెడ్డి పాల్గొన్నారు.