రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడిన బిఆర్ఎస్ యూత్ నాయకుడు భూక్య కృష్ణ.
Published: Wednesday December 14, 2022
బూర్గంపాడు (ప్రజా పాలన.)
ఈరోజు శ్రీనివాస నర్సింగ్ హోమ్, భద్రాచలం ప్రైవేట్ హాస్పటల్లో ఆరోగ్యం బాగోలేక శ్రీనివాస నర్సింగ్ హోమ్ లో అడ్మిట్ అవ్వడంతో అత్యవసర పరిస్థితుల్లో వారికి రక్తదానం అవసరమై తెలుసుకొని ప్రాణాన్ని నిలబెట్టిన బూర్గంపాడు మండలం సారపాక ,గాంధీనగర్ బిఆర్ఎస్ యూత్ నాయకుడు భూక్య కృష్ణ. ఇప్పటికే చాలాసార్లు రక్తదానం చేసి పలువురి ప్రాణాలు నిలబెట్టిన భూక్య కృష్ణ మరి ఎంతోమందికి రక్తదానం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగినది. ఆపదలో ఉన్న ఎలాంటి వారినైనా రక్తదానం మహాదానం అని తెలుసుకొని రక్తదానం చేసేందుకు తాను ఎప్పుడూ ముందు ఉటానని తెలిపారు.
Share this on your social network: