జవహర్నగర్లో అమరవీరుల స్ఫూర్తియాత్ర

Published: Wednesday May 18, 2022

జవహర్ నగర్(ప్రజాపాలన) : మేడ్చల్ జిల్లా కాప్రా మండల్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని  విశ్వకర్మ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో,తెలంగాణ మలిదశ నిర్మాత మారోజు వీరన్న వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ అమరవీరుల స్ఫూర్తి యాత్రను ఆ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి.ఇరవై రెండో డివిజన్ కార్పొరేటర్ బి లావణ్య సతీష్ గౌడ్ హాజరై యాత్రను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అమర వీరుల ఆత్మకథను వివరిస్తూ యాత్ర కొనసాగిస్తూనే విశ్వకర్మ హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా ఈనాడు స్వరాష్ట్రంలో మనం ఉన్నానంటే కారణం అమర వీరుల త్యాగఫలం మని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ కింది ప్రసాద్ గౌడ్ ,విశ్వకర్మ ఐక్య సంఘం భాష పల్లి రమేష్ చారి. ఇఫ్ట్ జాతీయ నాయకులు షేక్ శావలి, విశ్వకర్మ హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకులు ఆర్ సదానందం ఆచారి. మల్లెష్ చారి రామబ్రహ్మం. భైరవ చారి. గాలయ్య చారి. కృష్ణచారి, కేకే రమేష్ చారి మహేష్ చారి. కళాకారులు ఏపూరి యాకన్న జన సమితి నాయకులు ఎర్ర వీరన్న తదితరులు పాల్గొన్నారు