మధిర పట్టణ ఎస్ఐ ఉదయ్ కుమార్ ప్రమోషన్ పై బదిలీ సందర్భంగా సర్పంచులు సన్మానం

Published: Friday May 07, 2021

మధిర, మే 7, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో సందర్భంగా సైదిలిపురం సర్పంచ్ పులిబండ్ల చిట్టిబాబు గారు మాట్లాడుతూ మధిర పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుండి పని చేస్తూ, బదిలీపై వెళ్తున్న సందర్భంగా వారు విధినిర్వహణలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలకు తోడ్పడుతూ, శాంతిభద్రతల పట్ల ప్రజలలో చక్కని అవగాహన కల్పిస్తూ గుర్తింపు పొందారని తెలిపినారు ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ గారు మాట్లాడుతూ మధిర పట్టణ ప్రజలు శాంతి భద్రత పట్ల క్రమశిక్షణ నిర్వహిస్తూ, పేదలకు, పట్టణ ప్రజలకు సేవా కార్యక్రమాలను చేసే సేవలను అభినందిస్తూ, బాగస్వాములు కల్పిస్తూ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చి అధికారులకు తోడ్పాటు అందించారని తెలిపారు  మరియు మధిర ప్రజలు ఎల్లప్పుడూ గుర్తు ఉంటారని కొనియాడారు ఈ కార్యక్రమంలో దేశినేనిపాలెం సర్పంచ్ ఆవుల ఝాన్సీకిరణ్ గారు మరియు సైదిలిపురం  సర్పంచ్ పులిబండ్ల చిట్టిబాబు గారు పాల్గొన్నారు..