ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Published: Thursday June 10, 2021
మధిర, జూన్ 09, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిమధిర ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిని 100 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహకారంతో మధిర ప్రభుత్వాసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లత మొండితోక లత మాధవి ఏందిరా కనుమూరు వెంకటేశ్వరావు చి త్తార్ నాగేశ్వరావు అరిగే శ్రీనివాసరావు చావారవి వేణు కృష్ణ ప్రసాద్ అప్పారావు వంకాయలపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు