పీ.ఏ.సీ.యస్ కార్యాలయ నూతన భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
Published: Monday March 14, 2022
కోరుట్ల, మార్చ్ 13 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల మండలం చిన్న మెట్ పల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ నూతన భవనానికి ఆదివారం రోజున టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. సంఘ భవనాన్ని వీలైనంత త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే గొప్ప సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నుతిపెల్లి గంగరాజు ముత్తయ్య, యం.పి.పి తోట నారాయణ, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు చీటీ వెంకట్రావు, జిల్లా సర్పంచ్లు ఫోరం అధ్యక్షుడు దారిశేట్టి రాజేష్, టిఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Share this on your social network: