నేటి ప్రజావాణి రద్దు
Published: Monday August 22, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 21 ఆగస్టు ప్రజాపాలన : ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ నిఖిల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈనెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు 75 సంవత్సరాల స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నందున తేదీ 22న సోమవారం నాడు కూడా వజ్రోత్సవ ముగింపు కార్యక్రమాలు ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని, ప్రజలు ఇట్టి విషయాన్ని గ్రహించి తమ దరఖాస్తులను అందించేందుకు కలక్టరేట్ కార్యాలయానికి వచ్చి ఇబ్బంది పడకూడదని కలెక్టర్ తెలియజేశారు.
Share this on your social network: