సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిది ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Tuesday October 04, 2022

మేడిపల్లి, అక్టోబర్3 (ప్రజాపాలన ప్రతినిధి)

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి  నివాసంలో  ఉప్పల్ డివిజన్ కు చెందిన మంజుల సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు రూ 14,000/ ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారుడి కుటుంబ సభ్యులకు  అందజేశారు. ఈ  కార్యక్రమంలో  టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర రెడ్డి, గరిక సుధాకర్, చింతల నరసింహారెడ్డి, మస్కా సుధాకర్ , గొరిగే  ఐలేష్, మల్లేష్  తదితరులు పాల్గొన్నారు.