జ్యోతి బాపూలే గురుకుల పాఠశాల సమస్యలు పరిష్కరించాలి ** బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నర్ రమ
Published: Tuesday August 23, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు22 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న (బాబాపూర్)లో గల మహాత్మ జ్యోతిరావు బాలికల గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రూప్నర్ రమేష్ అన్నారు. సోమవారం సంఘం నాయకులతో కలిసి గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ పాఠశాలలో సక్రమంగా మెనూ పాటించాలని, బెంచీలు, బెడ్స్, మరియు బాత్రూములు, పాఠశాల వరకు రోడ్డు సౌకర్యం లేక, జనరేటర్ సౌకర్యం లేక, రాత్రి సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్, రైతు అధ్యక్షుడు మారుతి పటేల్, ప్రశాంత్, ప్రణీత్, తదితరులు ఉన్నారు.
Share this on your social network: