సిఎంఆర్ఎఫ్ పేదల పాలిట పెన్నిధి : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Published: Wednesday September 22, 2021
వికారాబాద్ బ్యూరో 21 సెప్టెంబర్ ప్రజాపాలన : సీఎంఆర్ఎఫ్ పేదల పాలిట పెన్నిధి అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కొనియాడారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో మోమిన్ పేట్ మండలానికి చెందిన లబ్దిదారులకు మోమిన్పేట్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బి.వెంకట్ ఆధ్వర్యంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ జబ్బులతో బాధపడుతున్న బాధితులకు కొండంత అండగా ఆర్థిక సహకారం అందుతుందని పేర్కొన్నారు. బాధితులు తమ జబ్బులను నయం చేసుకొని కుటుంబ ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడాలని హితవు పలికారు. మండల అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ.. మండల పరిధిలోని ప్రజలకు కు ఏ ఆపద వచ్చినా ఆదుకొనుటకు ముందుంటానని తెలిపారు. మండల అధ్యక్ష పదవి చేపట్టిన మొదటిసారి లబ్ధిదారులకు చెక్కులను అందజేయడంతోనే పార్టీ పరంగా బాధ్యతలు నిర్వహించినందుకు సంతోషంగా ఉందన్నారు. మేకవనంపల్లి గ్రామానికి చెందిన మాణయ్య, కోలుకుంద గ్రామానికి చెందిన కె.ప్రభాకర్, చంద్రాయన్పల్లి గ్రామానికి చెందిన హెచ్.యాదమ్మ, వెల్చాల్ గ్రామానికి చెందిన ఎం.విఠల్, చక్రంపల్లి గ్రామానికి చెందిన కె.మల్లమ్మ, మోమిన్పేట్ గ్రామానికి చెందిన టి.బాలమణి, రాంనాథ్ గుడుపల్లి గ్రామానికి చెందిన కె.మంజులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశామన్నారు. అనంతరం కొత్తగా ఎన్నుకోబడిన మండల, పట్టణ అధ్యక్షులను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.