బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం ** బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్

Published: Wednesday September 07, 2022

ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు 5 ప్రజాపాలన ప్రతినిది) : జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సోమవారం పట్టణానికి చెందిన పలువురు ఉపాధ్యాయులకు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్  రూప్నర్ రమేష్ సంఘం నాయకులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి నుండి నిర్మితమై ఉంటుందని అట్లాంటి తరగతిలోని విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు తల్లిదండ్రుల కన్నా గొప్ప వారని అన్నారు. "గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర " అన్నట్టు గురువులను దేవుళ్లతో పోల్చడం వృత్తికి ఉన్న గౌరవం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్ టి యు జిల్లా అధ్యక్షుడు సంజీవ్ కుమార్, రాజశేఖర్,సంతోష్, నాగేష్,లను సన్మానించారు. సన్మానించిన వారిలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ప్రణయ్ కుమార్, జిల్లా రైతు అధ్యక్షుడు వైర గాడే మారుతి పటేల్,నాగరాజు,ప్రశాంత్,కృష్ణ రమేష్,తదితరులు ఉన్నారు.