ధన్నారంలో ఘనంగా శ్రీ గడ్డ మైసమ్మ జాతర మహోత్సవం

Published: Friday January 20, 2023
వికారాబాద్ బ్యూరో 19 జనవరి ప్రజా పాలన : వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డు ధన్నారం గ్రామంలో శ్రీ గడ్డ మైసమ్మ జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు.18,19 తేదిలైన బుధ, గురువారాలలో రెండు రోజుల పాటు అంగ రంగ వైభవంగా నిర్వహించి అమ్మ వారికి భక్తి శ్రద్ధలతో పూజించి గ్రామంలోని మహిళలు మైసమ్మ తల్లికి ప్రత్యేక నైవేద్యాన్ని తయారు చేసి డబ్బు చప్పుళ్లతో బోనాలతో ఊరేగింపు గా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.ఈ జాతర మహోత్సవానికి జిల్లా పరిషత్ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ చిగుల్లపల్లి మంజుల రమేష్,మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, జడ్పి వైస్ చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ లు పాల్గొని మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా జన్నారం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు మహిళలు, యువకులు,చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.