జీవీఆర్ ను పరామర్శించిన వీరమోహన్ రెడ్డి..

Published: Monday September 26, 2022
తల్లాడ, సెప్టెంబర్ 25 (ప్రజా పాలన న్యూస్):
తల్లాడకు చెందిన టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గరిడేపల్లి వెంకటేశ్వరరావు(జీవీఆర్)ను ఆ పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు రెడ్డెం వీరమోహన్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. జీవీఅర్ మాతృమూర్తి  లక్ష్మి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వీరమోహన్ రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. జివిఆర్ ను పలు విషయాలు అడిగి తెలుసుకొని సంతాప సానుభూతిని వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు, నాయకులు రెడ్డెం రామకృష్ణారెడ్డి, నారాయణ రెడ్డి, గుండ్ల నాగయ్య, వేమిరెడ్డి కృష్ణారెడ్డి, నాగిరెడ్డి, కిషోర్ రెడ్డి, తదితరులు  ఉన్నారు.
 
 
 
Attachments area