బి.జే. పి.పట్టణ ప్రధాన కార్యదర్శిగా అముద రాజు

Published: Tuesday November 23, 2021

జగిత్యాల, నవంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి): భారతీయ జనతాపార్టీ జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఆముద రాజును నియమిస్తూ పార్టీ పట్టణ అధ్యక్షులు వీరభత్తిని అనీల్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. బీజేపీ లో చురుకైన కార్యకర్తగా పనిచేసిన రాజు సేవలను గుర్తించి ఈ నియామకం చేపట్టామని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాల విజయానికి కృషి చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షులు అనీల్ సూచించారు. ఆముద రాజు మాట్లాడుతూ పార్టీ ఆదేశాలను అనుసరించి బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని, పార్టీ నియమ నిబంధనలకు, పార్టీ సిద్ధాంతాలను అనుసరిస్తూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆముద రాజు నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.