గ్రామ స్థాయి బూత్ కమిటీలతో పార్టీని బలోపేతం .
Published: Friday December 16, 2022
జన్నారం, డిసెంబర్ 15, ప్రజాపాలన: ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ఆదేశాల మేరకు గురువారం చింతలపల్లి గ్రామ స్థాయి కమిటీలతో పార్టీని బలోపేతం చేస్తున్నామని, మంచిర్యాల జిల్లా జన్నారం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చింతలపల్లి, నూతన గ్రామ స్థాయి కమిటీ బూతు ఇంచార్జీ సభ్యులను ఎన్నుకున్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో బూత్ కమిటీలను పూర్తి చేస్తున్నామని మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు వివరించారు. బిఆర్ఎస్ పార్టీని మరింత బలపాతం చేయాలని, గ్రామస్థాయి బూత్ ఇన్చార్జిలకు, కార్యకర్తలకు తెలియజేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్ వైస్ ఎంపీపీ సుతారి వినయ్ కుమార్, జన్నారం మండల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భరత్ కుమార్, జన్నారం మండల్ కో ఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీఖాన్, నాయకులు, వోజ్జల రాజన్న, వోజ్జాల లచ్చన్న, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: