ప్రభుత్వ బడులను అభివృద్ధి చేసుకుందాం

Published: Thursday February 24, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 23 ఫిబ్రవరి ప్రజాపాలన : ప్రభుత్వ బడులను అభివృద్ధి చేసి విద్యా ప్రమాణాలకు కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. బుధవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో "మన ఊరు మన బడి" కార్యక్రమం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ప్రక్రియలు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మన ఊరు మన బడి కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ బి.విజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్, జడ్పీటీసీలు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.