అర్ధరాత్రి అధుపుతప్పిన బైక్ ముగ్గురికి గాయాలు. శంకరపట్నం డిసెంబర్ 18 ప్రజాపాలన రిపోర్టర్:
Published: Monday December 19, 2022
శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికీ చెందిన అంబాలశివ(19), తాళ్లపల్లి సాయి చరణ్ (20), కత్తెరమల్ల అంజి(18), శనివారం రాత్రి కొత్తగట్టు నుండి సింగపూర్ వెళుతుండగా పెద్దగుట్ట వద్ద బైకు అదుపుతప్పి అంబాలశివకు తలకు బలమైన గాయం తగిలింది. మిగిలిన ఇద్దరూ మామూలు గాయాలతో రోడ్డుమీద పడడంతో స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఈఎంటి సతీష్ రెడ్డి మరియు పైలట్ గోపికృష్ణలు వెంటనే స్పందించి క్షతగాత్రులను హుజురాబాద్ ప్రబుత్వ ఆసుపత్రికి తరలించారు.
Share this on your social network: