స్కాలర్ షిప్స్ దరఖాస్తు తేదీని పోడిగించాలి

Published: Tuesday February 01, 2022
ఎస్.ఎఫ్.ఐ.జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్
మంచిర్యాల టౌన్, జనవరి 31, ప్రజాపాలన: తెలంగాణ రాష్ట్రంలో ఉపకార వేతనాలకు విద్యార్ధులు దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదిని పోడిగించాలని మంచిర్యాల జిల్లా భారత విద్యార్ధి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ చేస్తుందని ఈ సంద్భంగా దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే అన్ని రకాల సెట్స్ కౌన్సెలింగ్ పూర్తి చేసుకోని విద్యార్ధులు యూనివర్శిటీలు, కాలేజీలో చేరుతున్నారని ఇప్పటి వరకు 9 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారని ఇంకా మూడున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకోవాలని వారి కోసం తక్షణమే గడువు తేదీని పెంచాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు లేని పక్షంలో పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తారు తెలిపారు.