స్కాలర్ షిప్స్ దరఖాస్తు తేదీని పోడిగించాలి
Published: Tuesday February 01, 2022
ఎస్.ఎఫ్.ఐ.జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్
మంచిర్యాల టౌన్, జనవరి 31, ప్రజాపాలన: తెలంగాణ రాష్ట్రంలో ఉపకార వేతనాలకు విద్యార్ధులు దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదిని పోడిగించాలని మంచిర్యాల జిల్లా భారత విద్యార్ధి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ చేస్తుందని ఈ సంద్భంగా దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే అన్ని రకాల సెట్స్ కౌన్సెలింగ్ పూర్తి చేసుకోని విద్యార్ధులు యూనివర్శిటీలు, కాలేజీలో చేరుతున్నారని ఇప్పటి వరకు 9 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారని ఇంకా మూడున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకోవాలని వారి కోసం తక్షణమే గడువు తేదీని పెంచాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు లేని పక్షంలో పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తారు తెలిపారు.
Share this on your social network: