డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి : మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Wednesday July 07, 2021
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నగర మేయర్ జక్కవెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కార్పోరేషన్ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 6వ రోజు 2వ డివిజన్ పంచవటి కాలనీలో, 9వ డివిజన్, 10వ డివిజన్ మల్లికార్జున నగర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ల ఆధ్వర్యంలో జరిగిన  డివిజన్ కమిటీ సమావేశాలలో ముఖ్య అతిధులుగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్రర శివ కుమార్ గౌడ్, కమిషనర్ శ్రీనివాస్ పాల్గోని కాలనీలలో జరుగుతున్న అభివృద్ది పనులు, మౌలిక సదుపాయాల కల్పన, శానిటేషన్, వీధిదీపాలు, త్రాగునీరు మొదలగు విషయాలపై కమిటీ సభ్యులతో చర్చించారు. తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు, కాలనీలలో ప్రతిఒక్కరు తమ ఇంటి ముందు వీలైనన్ని మొక్కలు పెంచుకోవలని సూచించారు, అనంతరం కాలనీ వాసులు, డివిజన్ కమిటీ సభ్యులతో కలిసి వివిధ కాలనీలతో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారి లింగస్వామి, మున్సిపల్ డి ఈ శ్రీనివాస్, వాటర్ వర్క్స్ డిజియం కార్తిక్ రెడ్డి, కార్పొరేటర్లు కె.సుభాష్ నాయక్, బచ్చ రాజు, వీరమల్ల సుమలత, మున్సిపల్ ఏఈ వినీల్ కుమార్, ఎలక్ట్రికల్ ఏఈ సత్యనారాయణ రెడ్డి, నాయకులు వీరమల్ల సత్యనారాయణ, కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.