ఆసిఫాబాద్ కవుల సంఘం 12వ వార్షికోత్సవం ** ఆలరించిన అష్టావధానం

Published: Tuesday December 27, 2022

ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 26 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో సోమవారం ఆసిఫాబాద్ కవుల సంఘం12వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అష్టావధానం కార్యక్రమం ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి. ప్రముఖ కవి, రచయిత, అష్టావధాని, మాడుగుల సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో పృచ్చక వర్గము నిషేధము సమస్య రేవతి, దత్త పది జయశారది గొల్లపల్లి బ్రహ్మయ్య, శ్రీరామ్ సత్యనారాయణ, నాగేశ్వర్ రావు, మహేందర్, ఇందారపు మధుకర్ శర్మలతో నిర్వహించిన అష్టావధానం కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రముఖ కవి గోడు రచయిత స్వర్గీయ డాక్టర్ వనపర్తి తిరుపతి స్మరక సాహితీ పురస్కారమును ప్రముఖ పద్మ కవి ఎర్రోజు జయ సారధికి ప్రధానం చేసి శాలువా జ్ఞాపకతోఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆకాశం గౌరవ అధ్యక్షుడు గుర్రాల వెంకటేశ్వర్లు, వ్యవస్థాపకులు నల్లగొండ రమేష్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కృష్ణమా చారి, చిలుకూరి రాధాకృష్ణ చారి, కిల్లి వెంకట్రావు,ఢిల్లీ విజయ్ కుమార్, రాజన్న, నాగోరావు, సరిత, జ్యోతి, హరిప్రియ,జ్యోతి, శ్రీదేవి, మాయ, తదితరులు పాల్గొన్నారు.