ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

Published: Monday June 13, 2022
మేడిపల్లి, జూన్12 (ప్రజాపాలన ప్రతినిధి)
హబ్సిగూడ డివిజన్లోని స్ట్రీట్  నెంబర్ 1 లో ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రత్యేక చొరవతో సి ఎస్ ఆర్ నిధులతో నిర్మాణమైన అదనపు  తరగతి గదుల ప్రారంభోత్సవానికి ఈనెల 17వ తేదీన ముఖ్యఅతిథిగా హాజరుకావాలని విద్యాశాఖ మంత్రి వర్యులు సబిత ఇంద్రారెడ్డిని ఉప్పల్ ఎమ్మెల్యే ఆహ్వానించారు. అదేవిధంగా రామంతాపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో డిగ్రీ కళాశాల ఏర్పాటును  పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ  కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గరిక సుధాకర్, ఎం. డి రహమాన్ తదితరులు పాల్గొన్నారు.