మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

Published: Tuesday January 03, 2023
జన్నారం, జనవరి 2, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో సోమవారం మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి రమేష్ కుమార్ మాట్లాడుతూ సంఘం అభివృద్ధి కోసం కలిసికట్టుగా ముందుకు సాగితే సాధించలేనిది ఏమీ లేదన్నారు. మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణ కోసం తమ వంతు సహకారం అందిస్తారని ఎంఆర్ఓ ఇట్టాల కిషన్ అన్నారు. ఈ సమావేశానికి మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కాసెట్టి లక్ష్మణ్ హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా జెడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్, ఎంపీపీ మాదాడి సరోజన, వైస్ ఎంపీపీ సుతారి వినయ్ కుమార్, ఎంపీడీవో అరుణా రాణి, ఎంపీఈఓ రమేష్, స్థానిక అదనపు ఎస్ఐ రాథోడ్ తానాజీ, రైతు సమన్యాయ సమితి మండల అధ్యక్షుడు గుర్రం రాజారాం రెడ్డి, ఎంపీటీసీ రియాజీద్దీన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీపతి బుచ్చన్న, ముత్యం సతీష్, గౌరవ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొంతం శంకరయ్య, పట్టణ అధ్యక్షుడు గోపి రవీందర్, ప్రధాన కార్యదర్శి లెక్కల మల్లయ్య,వమండల మున్నూరు కాపు సంఘ నాయకులు పూదరి నరసయ్య, నైనాల తిరుపతి, ఆరె సిరీస్, వోజ్రాలు లచ్చన్న, సుశీల, కాసెట్టి రాజన్న, 16 గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.