*క్రీస్తు బోధనలు ఆచారణీయం*
క్రిస్మస్ అంటే యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకునే సమయం అని, విశ్వ వ్యాప్తంగా ప్రజలందరిలో ప్రేమ, సహనం, కరుణ పూర్వక అనుబంధాలను మేల్కొల్పుతూ యేసు బోధనలను ఆదరించే సందర్భం అని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు పేర్కొన్నారు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని శనివారం నాడు రాత్రి 12:00 గంటల సమయంలో మధిర మండలం బయ్యారం గ్రామంలో ప్రసిద్ధి గాంచిన చర్చి లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన కుటుంబ సభ్యులతో కలసి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మం, విశ్వాసపూరితమైన గమనానికి యేసుక్రీస్తు జీవనం మనందరికీ ప్రేరణనిస్తుందని చెప్పారు క్రైస్తవ సోదర, సోదరీమణులు అంతా ఆనందోత్సాహాలతో క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని కోరారు ప్రజలందరికీ యేసుక్రీస్తు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్దించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు
Share this on your social network: