బాల్ బ్యాడ్మింటన్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎం జె పి విద్యార్థులు

Published: Thursday November 03, 2022

బోనకల్, నవంబర్ 3 ప్రజాపాలన ప్రతినిధి: తెలంగాణలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే వెనుకబడిన సంక్షేమ బీసీ గురుకులాల్లో నుండి వచ్చిన అండర్ 17 బాల్ బ్యాడ్మింటన్ సెలక్షన్ ఎం జె పి బోనకల్ గురుకులాల్లో నిర్వహించడం జరిగింది.ఈ సెలక్షన్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగింది. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 27 ,28, 29 ,30 తారీకులలో కిన్నెరసాని లో జరిగే ఇంటర్ సొసైటీ మీట్లో పాల్గొంటారు. ఎంపికైన క్రీడాకారులకు ఈ నెల 26 వరకు బోనకల్ మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో శిక్షణ క్యాంపు నిర్వహించబడునని ప్రిన్సిపాల్ అంజలి తెలిపారు. క్రీడాకారులను ఎంపిక చేయటానికి తోడ్పడిన కోచ్ సీనియర్ క్రీడాకారుడు లింగయ్యకు పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యోతిరావు పూలే పాఠశాల పి ఈ టి జె శివకృష్ణ, పాఠశాల సిబ్బంది, పాఠశాల విద్యార్థులు నరేష్, వెంకటేష్, లచ్చులాల్, రవి, సురేష్, విజయ్ పాల్గొన్నారు.