ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతను సన్మానించిన పొంగులేటి,

Published: Tuesday September 13, 2022
కోట రాంబాబు మధిర రూరల్ సెప్టెంబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో సోమవారం నాడు పలు కార్యక్రమాల్లో భాగంగా
మధిర, ఎర్రుపాలెం పర్యటనలో ఉన్న మాజీ ఎంపీ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధిర మండలం పర్యటనలో మాటూర్ తెరాస నాయకులు గ్రామ సర్పంచ్ మేడిశెట్టి లీలావతి, నాగేశ్వరరావు, ఎంపీటీసీ అడపాల వెంకటేశ్వర్లు,తెరాస కపిలవాయి సత్యనారాయణ రాజుల సూచన మేరకు జిల్లా కలెక్టర్ చే 2022 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత  మాటూర్ హైస్కూల్ గణితోపాధ్యాయులు శ్రీ మేడేపల్లి శ్రీనివాసరావును మాటూర్ హైస్కూల్ కి వెళ్లి అభినందనలు తెలియజేస్తూ పూలమాల, దుస్సాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం డా రాంబాబు అవార్డు్డు గ్రహీత మేడేపల్లి శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు.
  కఠినమైన గణితాన్ని భోదిస్తూ మంచి ఫలితాలు సాధించినందుకు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్ లో ఇంకా ఎక్కువ అవార్డులు సాధించాలని పొంగులేటి సూచించారుఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా,మండల నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.