ముస్లిం స్మశాన వాటిక ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన

Published: Tuesday May 04, 2021
మేడిపల్లి, మే3 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 6వ డివిజన్లో డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ మరియు స్థానిక కార్పొరేటర్ కోల్తూరు మహేష్తో కలిసి మేయర్ జక్క వెంకట్ రెడ్డి ముస్లిం స్మశాన వాటిక అభివృద్ధి పనులకు రూ 25 లక్షల ఎల్ఆర్ఎస్ నిధులతో ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో  కో ఆప్షన్ సభ్యులు షేక్ ఇర్ఫాన్, మున్సిపల్ డిఈ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు మాడుగుల చంద్రా రెడ్డి, కుర్ర శ్రీకాంత్ గౌడ్, అలువాల దేవేందర్ గౌడ్, జావిద్ ఖాన్, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.