రైతులకు సబ్సిడీపై కంది విత్తనాలు పంపిణీ

Published: Thursday June 17, 2021
మధిర, జూన్ 16, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంలోని మల్లారం రైతువేదిక నందు జాతీయ ఆహార భద్రత మిషన్(NFSM) 2021-22 వానాకాలం పథకం కింద రైతులకు 100 శాతం సబ్సిడీపై కంది మినికిట్ విత్తనాలు ఇవ్వడం జరిగింది. 2021 వానాకాలం సీజన్లో పత్తిలో అంతరపంటగా కంది సాగును ప్రోత్సహించి, నూతన మెళకువలు, విధానాలను అవలంబించాలని రైతులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లారం సర్పంచ్ మందడపు ఉపేంద్రరావు గారు, AEO వంశీ కృష్ణ సాయి, గ్రామ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మందడపు రామకృష్ణ మరియు రైతులు పాల్గొన్నారు.