బోనకల్లో పర్యటించిన జడ్పీ చైర్మన్ లింగాల

Published: Monday March 13, 2023

బోనకల్, మార్చి 12 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రం లో ఆదివారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పర్యటించారు. ముందుగా మల్లేల మంగమ్మ మనవరాలు ఓనీల అలంకరణ, మనవడు పంచ కట్టు వేడుకకు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.అనంతరం చెన్నా లక్ష్యాద్రి అస్వస్థతతో ఉండడంతో వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ బోనకల్ గ్రామ అధ్యక్షులు గుండపనేని సుధాకర్ రావు, బీఆర్ఎస్ గ్రామ కార్యదర్శి తేళ్లూరి రమేష్, బోనకల్ గ్రామ రైతు కన్వీనర్ మోర్ల నరసింహారావు, నాయకులు మోర్ల శ్రీనివాస్ , యార్లగడ్డ రమేష్ , గుగులోత్ శ్రీను,మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ, మాజీ సహకార సంఘం అధ్యక్షులు యార్లగడ్డ చిన్న నరసింహ, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.