కోరుట్ల కోట బురుజులు,కోనేరు, వాటి భూములను కాపాడాలి ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట

Published: Wednesday August 24, 2022
కోరుట్ల, ఆగస్టు 23 ( ప్రజాపాలన ప్రతినిధి ):
 కోరుట్ల కు చిహ్నం కోట బురుజులని చారిత్రక కట్టడాలను కాపాడుకోవలనే లక్ష్యం తో అనేక ఉద్యమాల ఫలితంగా వజ్రోత్సవాలను పురష్కరించుకొని జాతీయ వాదం ఉట్టిపడేలా బురుజులకు కొత్త శోభ తీసుకవస్తున్న మున్సిపల్ పాలకపక్షం వాటికి సంబంధించిన భూములను కూడా కాపాడాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ ప్రభుత్వాన్ని కోరారు.మంగళవారం కోరుట్ల లోని తన కార్యాలయంలో పేట భాస్కర్ మాట్లాడుతూ కోట బురుజులతో పాటు కోనేరు ను బాగుచేయాలని పట్టణ పరిసర ప్రాంతాల ప్రజల ఆహ్లాదంకై సౌకర్యాలు మేరుగుపరిచి అక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలు తొలిగించాలని అ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని అ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రం గా  తీర్చిదిద్దాలని పేట భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 
 
 
Attachments area